కొత్త గా ఏర్పడిన రాష్ట్రానికి అనేక సవాల్లున్నాయని వాటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లు గ రూ . 23,475.34 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 14 వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది .
చెరువుల పునరుద్ధరణకు ,వాటర్ గ్రిడ్ ల నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి , సంక్షేమ పథకాల అమలుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు .
వెనుకబడిన కులాలకు సమగ్రాభివృద్ది కి ఐదేళ్ళ కాలం లో 25,000 కోట్లు , ఎస్సి ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్ ఆర్థిక సంఘానికి వివరించారు .
ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో పని చేస్తుందని 14 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్ వై వి రెడ్డి ప్రశంసించారు . అవసరాల మేరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు .
