కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల మందికి పని లేకుండా పోయింది పైగా అపోజిషన్ వాళ్ళ కు కూడా , ఏది చేద్దామన్న కొండను డీ కొట్టి న ఎలుక పరిస్థితి లా ఉంది . అసలే కొత్త ప్రభుత్వం అందునా కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు , లగడపాటి లాంటి వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు .
దళితున్ని ఉప ముఖ్యమంత్రి ని చేసిన కెసిఆర్ ను పొగిడిన వాళ్ళెంత మందో తెలియదు కానీ పిలవని పేరంటానికి వెళ్లినట్టు మందకృష్ణ రాజయ్య విషయం లో దూరి కులం పేరుతో నానా యాగి చేస్తున్నాడు ,నిజానికి కులం సేవ చేయాలంటే ఎన్నో మార్గాలున్నాయి ఉప ముఖ్యమంత్రి తో కలిసి తన కుల సమస్యల ను పరిష్కరించుకుంటే అది కులానికి మంచిది చేసినందుకు అతనికి పేరు ఉంటది . ఎవరికీ ఉపయోగపడని పని ఎందుకు .
తన రాజకీయానికి మాత్రమె కులాన్ని ఉపయోగించే నాయకులను కులం కూడా క్షమించదు .
కెసిఆర్ నాకు తండ్రి లాంటి వాడు కొడుకును అన్నట్టు అన్నడు అందులో తప్పేం లేదు అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ మందకృష్ణ సీన్ లోకి ఎందుకు వచినట్లో అందరికి తెలిసిన సత్యమే .. పోలవరం ముంపు మండలాలను కలుపుకొని తెలంగాణా లో మొఖం లేని రాజకీయ పార్టీ లు కొత్త గా ఒక రాజకీయ చదరంగాన్ని నడుపాలి అది కూడా కులం పేరు తో చేస్తే ఆ కులం వాళ్ళ మద్దతు కూడా ఉంటది .. ఆట అప్పుడు ఈజీ గా ఉంటది చివరాకరకు ఈ నాటకం నడిపిన వ్యక్తి కి డబ్బో లేదా ఓ పదవి పడేస్తే సరి .. ఇవి నక్క జితుల తెలుగు బాబు కు తెలువని విద్య కాదు .
సమాజం మారి పోతుంది మనం మారాలి ఇంకా ఆంధ్ర పార్టీ ల తోతుల కు ఇక్కడ ఎవరు మదతు ఇస్తరు . కులం మంచి కోరి కులానికి ఉపయోగపడే పనులు చేస్తే మంచిది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటే ఆ కులం వాళ్ళు కూడా క్షమించరు .
