ఖమ్మం లో అనుమతి లేని వడ్డీ వ్యాపారులపై మరియు ఫైనాన్సు వ్యాపారుల పై ఏక కాలంలో జిల్లా వ్యాప్తంగా SP రంగనాథ్ అధ్వర్యంలో దాడులు జరగడం రాష్ట్రం లోని అక్రమ వడ్డీ వ్యాపారుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది .
పాల్వంచ లో ఒక వడ్డీ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన తాకట్టు బంగారం స్వాదీనం చేసుకోవడం తో ఏ రీతిన ఈ వ్యాపారం సాగుతుందో తెలిసి పోతుంది.
రిజర్వు బ్యాంకు నిబందనలు ఉల్లంఘించి ఫైనాన్సు చేస్తున్న వారందరి డేటా ను SP రంగనాథ్ గారు ముందు గా సేకరించి దాడుల చేయించారు . ఖాళీ ప్రామిసోరి నోట్ పైన ,స్టాంప్ వేసిన వైట్ పేపర్ పైన సంతకాలు తీసుకోవడం ఆ తర్వాత ఇష్టం వచ్చిన అమౌంట్ వేసుకొని కోర్ట్ నోటీసులు పంపడం వీరి అరాచకానికి పరాకాష్ట .
ఈ దాడుల వల్ల కొన్ని వందల ఆత్మహత్య లను SP రంగనాథ్ ఆపివేయడం జరిగింది . ఉద్యోగుల దగ్గర నుండి ATM కార్డు లు తీసుకోవడం ,జీతం వచ్చిన తర్వాత వారి అనుమతి లేకుండా లేకుండా డ్రా చేసుకోవడం ,బ్లాంక్ చెక్కులు పై సంతకం పెట్టించుకోవడం ఇవ్వకుంటే చెక్కు బౌన్సు కేసు పెడుతనని బెదిరించడం అక్రమ వడ్డీ వ్యాపారుల నిత్యకృత్యాలు.
వడ్డీ వ్యాపారులను ఎదుర్కోవడం అంటే అది మాములు విషయం కాదు ,వారి అంగ ,అర్థ బలం అలాంటిది
ఇక రాజకీయ ఒతిళ్ళ గురించి చెప్పనక్కరలేదు . వీటన్నిటిని లెక్క పెట్టకుండా ప్రజల కు నిస్వార్థంగా సేవ చేస్తున్న SP రంగనాథ్ అభినందనీయుడు.
RBI ఈ మధ్యనే అక్రమంగా 34000 కు పైగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీస్ ఉన్నట్టు పేర్కొంది
మిగతా జిల్లాల SP లు ఇదే తరహ దాడులు నిర్వహిస్తే మరింత మంది ని అప్పుల ఊబినుండి విముక్తులను చేసినట్టవుతుంది . అసలే కరువు తో నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు ఈ అక్రమ వడ్డీ వ్యాపారులండి అంతులేని నష్టం జరుగుతుంది . వీళ్ళు పెట్టె ఇబ్బందులకు మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది .
RBI నిబందనలకు లోబడి చేసే వ్యాపారుల వాళ్ళ సమాజానికి ఎలాంటి నష్టం లేదు , కాని రూ 3 నుండి రూ 15 వరకు దౌర్జన్యంగా వడ్డీ వసూలు చేసే వారితో తీవ్ర ఆర్ధిక అసమానతలు ఏర్పడ్తాయి . ఇది తెలంగాణా సమాజనికి
ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు .
