ఇది ప్రజలచే, ప్రజలకొరకు, ఇది ప్రజలు కోరిన, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర మ్యానిఫెస్టో.
అయిదెండ్ల కాలానికి ప్రజలకు ఆచరణయోగ్యమైన ఒక నిర్దిష్టమైన కార్యాచరణ. ఇది ప్రజల ఆకాంక్షల మేరకు అమలు పరిచె ఒక ప్రణాళిక. ఇది ప్రజాకూటమి ప్రజలకిచ్చే వాగ్దానం.
మరి ఒకసారి గత తెరాస చూస్తె, వారికి మ్యానిఫెస్టొ అంటె అర్ధం తెలవదు, మాయమాటలుజెప్పి ఓట్లేపించుకునే మోసపత్రం. ఇచ్చినమాట మీద నిలబడాలన్న ఇంగితం తెల్వనొల్లకింద నలుగుతున్న తెలంగాణ. మభ్యపెట్టనీకే ఏదొకటి చెప్పి, అధికారం చేజిక్కిచ్చుకోవాలె, జనాలసొమ్ము దోచుకోవలె. ఇచ్చిన హామీలు ఏమయినయ్ అంటే, అడిగినొన్ని అంతమొందించాలె. దీన్నెమంటరు? దోపిడీకాదా? లూటీకాదా? దుర్మార్గం కాదా?
గాని గిప్పుడు మన ప్రజాకూటమిది ప్రజలపంథా, ప్రజలే తమకు కావలసినవి చెప్పి చేయించుకునేటందుకు ఒక సహకార వేదిక, ప్రజాస్వామ్య దీపిక.
ఉద్యమానికి ఊపిరి ఊది, దాగుండి దవాఖానల జూస్తాగి జూట్మూట్ దీక్షజేసిన గుంటనక్కని, తమ ఆకాంక్షలను అవమానించిడన్న ఆక్రొశంతో, అగ్గిపెట్టె దొరకని దొర అల్లుడు, ఆత్మార్పణ చేస్తెకాని తెలంగాణ బతుకులు తెల్లారవని చెప్పిన కల్వకుంట్ల కుటుంబాన్ని నడితెలంగాణల ఉరితీయమంటున్నవి అమరుల ఆకాంక్ష ఆర్తనాదాలు, ఆత్మలు.
ఇగ మీరు, అంటే ప్రజలు ఇచ్చిన సూచనలు, వినతులల మరియు ఎంతో అనుభవం కల్గిన తెలంగాణ మేదావులు, విద్యార్థులు, ఉద్యమకారుల మార్గదర్శనం మేరకు రూపుదిద్దుకున్న ప్రజామ్యనిఫెస్టో.
ఇది మన ప్రజా తెలంగాణ, మన ప్రజల మ్యానిఫెస్షో.
గమనిక: కల్వకుంట్ల కంపెనీ, అనగా K కంపెనీ (డీ కంపెనీ, నయీమ్ కంపనిలాంటిది) మన ప్రజామ్యనిఫెస్షోని దోంగిలించి, ఒక 6 రూపాయలో, 16 రూపాయలో జొడంచి మల్ల 5 ఇండ్లు తెలంగాణను నిలువు దొపిడిజెయ్యనీకే నక్కి ఉన్నరు, జర పైలం.





