Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Showing posts with label TELANGANA ELECTION SURVEY 2018. Show all posts
Showing posts with label TELANGANA ELECTION SURVEY 2018. Show all posts

Sunday, November 4, 2018

కాంగ్రెస్ మ్యానిఫెస్టో !

ఇది ప్రజలచే, ప్రజలకొరకు, ఇది ప్రజలు కోరిన, ప్రజాస్వామ్యయుతంగా, ప్రజల భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న తెలంగాణ రాష్ట్ర మ్యానిఫెస్టో.
అయిదెండ్ల కాలానికి ప్రజలకు ఆచరణయోగ్యమైన ఒక నిర్దిష్టమైన కార్యాచరణ. ఇది ప్రజల ఆకాంక్షల మేరకు అమలు పరిచె ఒక ప్రణాళిక. ఇది ప్రజాకూటమి ప్రజలకిచ్చే వాగ్దానం.
మరి ఒకసారి గత తెరాస చూస్తె, వారికి మ్యానిఫెస్టొ అంటె అర్ధం తెలవదు, మాయమాటలుజెప్పి ఓట్లేపించుకునే మోసపత్రం. ఇచ్చినమాట మీద నిలబడాలన్న ఇంగితం తెల్వనొల్లకింద నలుగుతున్న తెలంగాణ. మభ్యపెట్టనీకే ఏదొకటి చెప్పి, అధికారం చేజిక్కిచ్చుకోవాలె, జనాలసొమ్ము దోచుకోవలె. ఇచ్చిన హామీలు ఏమయినయ్ అంటే, అడిగినొన్ని అంతమొందించాలె. దీన్నెమంటరు? దోపిడీకాదా? లూటీకాదా? దుర్మార్గం కాదా?
గాని గిప్పుడు మన ప్రజాకూటమిది ప్రజలపంథా, ప్రజలే తమకు కావలసినవి చెప్పి చేయించుకునేటందుకు ఒక సహకార వేదిక, ప్రజాస్వామ్య దీపిక.
ఉద్యమానికి ఊపిరి ఊది, దాగుండి దవాఖానల జూస్తాగి జూట్మూట్ దీక్షజేసిన గుంటనక్కని, తమ ఆకాంక్షలను అవమానించిడన్న ఆక్రొశంతో, అగ్గిపెట్టె దొరకని దొర అల్లుడు, ఆత్మార్పణ చేస్తెకాని తెలంగాణ బతుకులు తెల్లారవని చెప్పిన కల్వకుంట్ల కుటుంబాన్ని నడితెలంగాణల ఉరితీయమంటున్నవి అమరుల ఆకాంక్ష ఆర్తనాదాలు, ఆత్మలు.
ఇగ మీరు, అంటే ప్రజలు ఇచ్చిన సూచనలు, వినతులల మరియు ఎంతో అనుభవం కల్గిన తెలంగాణ మేదావులు, విద్యార్థులు, ఉద్యమకారుల మార్గదర్శనం మేరకు రూపుదిద్దుకున్న ప్రజామ్యనిఫెస్టో.
ఇది మన ప్రజా తెలంగాణ, మన ప్రజల మ్యానిఫెస్షో.
గమనిక: కల్వకుంట్ల కంపెనీ, అనగా K కంపెనీ (డీ కంపెనీ, నయీమ్ కంపనిలాంటిది) మన ప్రజామ్యనిఫెస్షోని దోంగిలించి, ఒక 6 రూపాయలో, 16 రూపాయలో జొడంచి మల్ల 5 ఇండ్లు తెలంగాణను నిలువు దొపిడిజెయ్యనీకే నక్కి ఉన్నరు, జర పైలం.
Read More

Thursday, October 25, 2018

న‌మ్మ‌క‌మైన స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు. తెలంగాణ‌లో అధికారం వీరిదే...

ఐదు సంవ‌త్స‌రాలు పాలించే అవ‌కాశం ఉన్నా, కేసీఆర్ ఎందుకు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్న‌ట్లు అన్న అనుమానాలు అప్ప‌ట్లో అందరిలోనూ వ్య‌క్త‌మ‌య్యాయి. కేసీఆర్ ఎదో బ‌ల‌మైన కార‌ణం లేనిది అధికారాన్ని వ‌దులుకొని, మ‌ళ్లీ అదే అధికారం కోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎందుకు వెళ్తాడు అన్న అంశం పై అనేక ర‌కాల చ‌ర్చ‌లు, వాదోప‌వాదాలు జ‌రిగినా…ప్ర‌తిప‌క్షాల‌ను నామ‌రూపాలు లేకుండా చేసి, మ‌ళ్లీ గెలుస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్న వాద‌న బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. పైగా స‌ర్వేల‌న్నీ ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌టంతో కేసీఆర్ ఆల‌స్యం చేయ‌కుండా అసెంబ్లీని ర‌ద్దుచేసి, ప్ర‌జ‌ల ముందుకొచ్చాడు.
కానీ... అప్పుడ‌నుకున్న‌ట్లు ఇప్పుడు విప‌క్షాలు చెల్లాచెదురుగా లేవు. అన్నీ ఒక్క‌ట‌య్యాయి. కాంగ్రెస్-టీడీపీ క‌లిసి పోటీచేస్తుంద‌ని ఎవ‌రూ అనుకోలేదు. అస‌లు అది ఊహ‌కంద‌నిది. వీటికి తోడు తెలంగాణ ఐకాన్ కోదండ‌రాం టీజెఎస్, తెలంగాణ‌కు మ‌ద్దితిచ్చిన సిపిఐ కూడా మ‌హ‌కూట‌మికి జై కొట్ట‌డంతో… ప‌రిస్థితి మారిపోయింది. పైకీ మీడియా పెద్ద‌గా చూపించ‌క‌పోయినా, గ్రౌండ్ లో రియాల్టీ మారుతుంద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతోంది. మ‌హకూట‌మి ఏర్ప‌డ్డ త‌ర్వాత ఉత్త‌ర భార‌త‌దేశానికి చెందిన ఓ సంస్థ చేసిన స‌ర్వే… విస్తుపోయే నిజాలను బ‌య‌ట‌పెట్టింది. ఈ సంస్థ‌కు అత్యంత న‌మ్మ‌క‌మైన స‌ర్వేగా పేరుండ‌టం విశేషం. ఉత్త‌రాదికి చెందిన డీవోటర్స్ టుడే అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీకి కేవ‌లం 30 నుండి 35 మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేలింది. అందులోనూ 22 స్థానాలు ప‌క్క గా గెలిచి తీరుతుంద‌ని, మిగిలిన వాటిలో ఎక్కువ‌గా విజ‌యావ‌కాశాలున్నాయ‌ని తెలిపింది. మ‌రోవైపు మ‌హ‌కూట‌మికి మాత్రం అత్యంత బూస్ట్ ఇచ్చేలా… భారీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని తెలిపింది.
మ‌హ‌కూట‌మి మొత్తం 75 - 78 స్థానాల‌కు పైగా కైవ‌సం చేసుకొని, అధికారం చేప‌డుతంద‌ని స‌ర్వే తేల్చింది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ ప్ర‌స్తుతం ఉన్న 5 సీట్ల‌లో 3 సీట్లు కోల్పోయి కేవ‌లం 2 సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని ప్ర‌క‌టించింది. గ‌తంలోలాగా ప్ర‌స్తుతం తెలంగాణ‌లో సెంటిమెంట్ ఇక ప‌నిచేయ‌ద‌ని, అందుకే టీఆర్ఎస్ కు కాలం చేల్లింద‌ని కూడా తేల్చింది. ప్ర‌జ‌లు అభివృద్దిని కోరుకుంటున్నార‌ని, కేవ‌లం మాట‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యే పార్టీల‌ను కాదంటున్న‌ట్లు డీ-వోట‌ర్ స‌ర్వేలో వెల్లడయ్యింది.
( పల్స్ ఆఫ్ తెలంగాణా)
Read More