కేసీఆర్ అర్ధరాత్రి హడావిడిగా చర్చలు. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు,కేంద్ర రాజకీయాలలో అన్ని పార్టీలు బాబుగారి నేతృత్వంలో నడవటం, బీజేపీకి దేశవ్యాప్తంగా వ్యతిరేఖత పెరగడంతో కెసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలైంది .థర్డ్ ఫ్రంట్ పేరుతో స్పెషల్ విమానంవేసుకొని ఊరేగినా ఎవ్వడు అటువైపు కూడా చూడలేదు .భాజాపా ని చూసుకొని బలుపెక్కిన మాటలతో ప్రక్క తెలుగురాష్ట్రం ముఖ్యమంత్రిని నీచంగా మాట్లాడి వున్నపరువుపోగొట్టుకొని రెంటికి చెడ్డ రేవడిగా మిగిలాడు .ఇప్పుడు దేశరాజకీయాలు దేముడెరుగు .ఉన్నరాష్ట్రంలో కోటలు బీటలు బారుతున్నాయి .అధికారం ఎండమావులవుతున్న తరుణంలో పాత ఆయుధం బయటకుతీయాలని నిర్ణయించడం జరిగింది .కొన్ని రోజులనుండి ఆసెంటిమెట్ ఆయుధం మళ్ళి పనిచేస్తుందాలేదా అని మద్యమద్యలో ప్రయోగించారు .ఇప్పుడు పూర్తిస్థాయిలో సెంటిమెంట్ ఆయుధంతో వెళ్లడానికి నిర్ణయం జరిగింది .మళ్ళీ ఆంధ్రా తెలంగాణ పేరుతో అగ్గిరాజేసి చలికాసుకోవాలని కల్వకుంట్ల వారి ఆలోచన .తెలుగు ప్రజలమధ్య చిచ్చుపెడితే అది ఒక కెసిఆర్ కె లాభమని అందరికి తెలుసు .కెసిఆర్ పనికిమాలిన ఆలోచనలతో తెలుగురాష్ట్రాలు రెండూకూడా నష్టపోయాయి.కేంద్రం ఆడిన నాటకాలకు కెసిఆర్ పావుగా మారడంతో రెండురాష్ట్రాల అభివృద్ధి ఆగిపోయింది . పిట్టపోరు ,పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్లు మోడీ తెలుగురాష్ట్రాలను వారి ఆత్మాభిమానాన్ని నడీబజారులో నగ్నంగా నిలపెట్టాడు. తెలుగురాష్ట్రాల పాలన వేరైనా సమస్యలను సానుకూలతతో పరిష్కరించుకొంటే దేశంలో నెంబర్ వన్ గా ఉంటాం .కెసిఆర్ నియంత పాలనతో ప్రక్కరాష్ట్రం మీద నీచ ద్వేష రాజకీయాలు నడిపినంతకాలం మనం ఎక్కినకొమ్మ మనం నరుక్కోవడమే .ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను రెండుకళ్ళు గా చూడగలిగిన నాయకుడు కావాలి. రెడుకళ్ళసిద్దాతం అని హేళనచేసినవారికి ఇప్పుడు తత్త్వం బోధపడింది. ఒకరాష్ట్రం లో అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తే అధికారం వస్తుందేమో కానీ రాష్ట్రం సంకనాకిపోతుంది. జనానికి అభివృద్ధి కావాలంటే సెంటిమెంట్ కు సమాధి కట్టండి.సెంటిమెంట్ పేరుతో రెచ్చకొట్టే పిచ్చి కుక్కలను తరిమి తరిమి కొట్టండి .