తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ భాజపా నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారత ప్రభుత్వం మహారాష్త్ర గవర్నర్ గా నియమించింది . కరీంనగర్ నుండి లోకసభకు పోటి చేసి ఓడి పోయిన విద్యాసాగర్ రావు ను మోడీ ప్రభుత్వం గుర్తించి గవర్నర్ పదవిని ఇవ్వడం శుభపరిణామం . ఎంతో కాలంగా పార్టీ కి ఆయన చేసిన సేవల కు గాను ఈ పదవి వరించింది . రాష్ట్ర శాఖా ఏర్పాటు చేసిన అభినందన సభ లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు ను అభినందించారు .
